Sunday, April 28, 2024

యాదాద్రీశ్వరుని సేవలో మంత్రి ఎర్రబెల్లి, హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బొల్లం సంపత్

తెలంగాణ‌లో ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వామివారిని దర్శించుకున్నారు.

అలాగే తెలంగాణ రాష్ట్ర హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ బొల్లం సంపత్ కుమార్ గుప్తా స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అదేవిధంగా స్వామివారిని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి దర్శించుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement