Monday, April 29, 2024

MIM – కాంగ్రెస్ రిమోట్ ఆర్ ఎస్ ఎస్ చేతిలో … అస‌దుద్డీన్

హైద‌రాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ రిమోట్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉందని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కారణంగానే కేంద్రంలో బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తోందని విమర్శించారు. బీజేపీ గెలుపున‌కు కాంగ్రెస్ తనను బాధ్యుడిగా చెబుతోందని, కానీ ఆ పార్టీ విజయం సాధిస్తే తాను ఎలా బాధ్యుడిని అవుతాను? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలోనూ కాంగ్రెస్ తనపై దుష్ప్రచారం చేస్తోందన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఆరెస్సెస్‌తోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. అందుకే ఇప్పుడు గాంధీ భవన్ రిమోట్ మోహన్ భగవత్ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా బీజేపీతో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టిన చోట మజ్లిస్ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో ఈసారి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపామన్నారు. తమ ఏడు స్థానాలను కైవసం చేసుకుంటామని తెలిపారు. అలాగే కెసిఆర్ తిరిగి ముఖ్య‌మంత్రి కావ‌డం త‌ధ్య‌మ‌న్నారు.. తాము పోటీ చేయ‌ని చోట బిఆర్ఎస్ అభ్య‌ర్ధుల‌కు మ‌ద్ద‌తు ఇస్తామ‌న్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement