Saturday, May 4, 2024

TS: క్రీడలతో మానసికోల్లాసం.. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

క్రీడలతో మానసికోల్లాసం పెంపొందుతుందని కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలియజేశారు. ఇవాళ జగిత్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను మెట్ పల్లి పట్టణ మినీ స్టేడియంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడా పోటీల వల్ల గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యం బహిర్గతమవుతుందన్నారు.

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలన్నారు. తమ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుందన్నారు. అనంతరం పలు విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మెడల్స్ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement