Tuesday, May 7, 2024

సుల్తానాబాద్ లో మెగా యోగా శిక్షణ

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రామగుండం కమిషనరేట్ లోని సుల్తానాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా యోగా శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన యోగా శిక్షణ శిబిరానికి యువతీ యువకులు వేలాదిగా తరలివచ్చారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసిపి ఎడ్ల మహేష్ మాట్లాడుతూ యోగా సాధనవల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు ప్రతినిత్యం యోగా చేయడం వల్ల శారీరకదారుడ్యం పెంపొందడంతో పాటు మానసికోలాసం కలుగుతుందన్నారు. ప్రతినిత్యం వాకింగ్, రన్నింగ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సీఐలు జగదీష్, అనిల్, ఎస్ఐలు, విజయేందర్, వెంకటకృష్ణ, శ్రీనివాస్, శ్రీధర్ తో పాటు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement