Thursday, May 16, 2024

ఖమ్మంలో మెగా జాబ్‌మేళా – 140 కంపెనీలలో 8,150 ఉద్యోగాలు

ఖమ్మం జిల్లా : పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్‌మేళాకు విశేష స్పందన లభిస్తుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.
నిరుద్యోగ యువతకు ప్రవేటు,కార్పొరేట్ కంపెనీలో ఉపాధి కల్పించే లక్ష్యంగా నిర్వహించే మెగా జాబ్ మేళా వివరాలు వెల్లడించేందుకు పోలీస్ కమిషనర్ ఈరోజు విలేకర్ల సమావేశం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ …ఈ నెల 21 నగరంలోని SBIT ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే జాబ్ మేళాకు జిల్లావ్యాప్తంగా 14 వేల మంది నిరుద్యోగులు ఆయా కంపెనీల్లో ఉద్యోగాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు.


విద్యార్హతలకు అనుగుణంగా 140 కంపెనీలలో 8,150 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలు ముందుకు వచ్చినట్లు పెర్కొన్నారు.సుమారు 15 వేల మంది పైగా జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగార్థులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి పలు ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారని తెలిపారు.పదో తరగతి వారి దగ్గర నుంచి డిగ్రీ, పీజీ వరకు చదివిన వారికి కూడా ఉద్యోగ, ఉపాధి కల్పించనున్నారని తెలిపారు.
ఎంపికైనవారికి రూ. 10 వేల నుంచి రూ.80 వేల వరకు జీతాలు వచ్చే అవకాశం ఉందని,సాఫ్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి అధిక శాలరీ ఆఫర్ చేసేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.


ఫార్మా, మెడికల్, ఐటీ కంపెనీలతో పాటు బ్యాంకింగ్, సర్వీసెస్, ఎడ్యుకేషన్ రంగాల్లో టెలీకాలర్స్ నుంచి మల్టీ నేషనల్ కంపెనీల వరకు ఈ జాబేళాలో పాల్గొనేలా ఆయా కంపెనీలను ముందుకు వచ్చాయని అన్నారు.
ఇంత భారీస్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కంపెనీలు ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు ముందుకు రాలేదని, కావున నిరుద్యోగ యువత తన భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని సూచించారు.
యువత ఉద్యోగ, ఉపాధి పొందాలనే లక్ష్యంగా హోంగార్డు ఆఫీసర్ నుండి పోలీస్ అధికారుల వరకు గ్రామీణ ప్రాంతాలలో సైతం విస్తృతంగా ప్రచారం చేస్తూ..ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని వారందరినీ పోలీస్ కమిషనర్ అభినందించారు.
ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారే కాకుండా నేరుగా హజరై రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఇప్పటివరకు జిల్లాలోని నిరుద్యోగ యువత అయా పోలీస్ స్టేషన్లలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని యువత కూడా జాబ్ మేళా లో పాల్గోనవచ్చని పోలీస్ కమిషనర్ ఈ సందర్భంగా తెలిపారు.
అనేక కంపెనీలు వస్తున్నందున కనీసం 10 Resume files తయారు చేసుకుని రాగలరని అభ్యర్థులకు మనవి చేశారు.
మీడియా ద్వారా జాబ్ మేళా అవకాశాన్ని సమాజానికి తెలియజేసి అర్హులైన యువత మరింత ప్రోత్సహించాలని మీడియా వారికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్ర బోస్ , ఏసీపీలు గణేష్ , భస్వారెడ్డి, రామోజీ రమేష్ , రహెమాన్ , ప్రసన్న కుమార్, వేంకటేశ్వర్లు, వెంకట స్వామి, సిఐ తుమ్మ గోపి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement