Monday, April 29, 2024

అండగా ఉంటా బాగా చదువుకో.. దివ్యాంగురాలికి బైక్‌ అందజేసిన ఎమ్మెల్యే జీఎంఆర్

పటాన్ చేరు, ప్రభ న్యూస్ : ఓ దివ్యాంగురాలైన యువతి ఉన్నత చదువులు చదివేందుకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భరోసా కల్పిస్తూ అండగా నిలిచారు. శుక్రవారం జిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దమ్మ గూడెం గ్రామానికి చెందిన కొన్నే శృతి తన చదువులకు అడ్డుగా ఉన్న అవిటితనాన్ని సైతం లెక్కచేయకుండా ముందడుగు వేసేందుకు స్థానిక ఎమ్మెల్యే వెన్నుతట్టి ప్రోత్సహించారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎంఆర్ సొంత నిధులతో గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం ద్వారా శృతికి ద్విచక్ర వాహనాన్ని అందజేసి ఉదారతను చాటుకున్నారు. భవిష్యత్తులో కూడా అండగా ఉంటానని విద్యార్థినికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బాగా చదువుకొని గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే సహకారానికి పేద విద్యార్థిని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసి అందుకు సహకరించిన నాయకులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ ,వెంకటేశం గౌడ్, స్థానిక సర్పంచ్ లావణ్య, ఉప సర్పంచ్ సంజీవ ,వార్డు సభ్యులు శ్రీనివాస్ యాదవ్ శ్రీధర్ గౌడ్ లింగం సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ స్థానిక నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement