Wednesday, May 15, 2024

గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులతో వెట్టిచాకిరీ..

మెదక్‌ : పాఠశాలలో విద్యార్థులతో వెట్టిచాకిరి చేయిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గిరిజన సంక్షేమ పాఠశాలలో లేబర్‌ లేరంటూ అక్కడి సిబ్బంది విద్యార్థులతో పనులు చేపిస్తున్నారు. భోజనాలు వడ్డించే సమయంలో విద్యార్థులతోనే పని చేపిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదంటా నారాణపూర్‌ గిరిజన సంక్షేమ పాఠశాలలో చోటుచేసుకుంది. వెంటనే అధికారులు స్పందించి గిరిజన సంక్షేమ పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement