ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన మెదక్ జిల్లా పరిధిలోని బొల్లారం రింగ్ రోడ్డుపై జరిగింది. బతుకుదెరువు కోసం వచ్చిన కూలీలు ప్రాణాలను పోగొట్టుకున్నారు. వాటర్ ట్యాంకర్ తో చెట్లకు నీళ్లు పడుతున్న నవీన్, సత్తయ్య కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి…..ఓ కారు అతివేగంగా వెనుక నుంచి వచ్చి ఢీకొనడంతో ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి చూడగా.. కారులో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. విగత జీవులుగా పడి ఉన్న సత్తయ్య, నవీన్ మృతదేహాలను పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..