Sunday, April 28, 2024

రూపాయి ఖర్చు లేకుండా పేద‌ల‌కు రెండు పడకల ఇళ్లు : మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట: రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి పైరవీలకు తావులేకుండా ప్రతి పేదోడికి ఇళ్లు అందించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిరుపేదలకు రెండు పడకల ఇళ్లు అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని పాలమాకులలో కొత్తగా నిర్మించిన 23 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే సొంతజాగాలో ఇళ్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇండ్ల నిర్మాణం కోసం ఇచ్చే పైసలు బేస్‌మెంటుకు కూడా సరిపోయేవి కాదని విమర్శించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా ఇళ్లు కట్టించి తాళం చేతిలో పెట్టి లబ్ధిదారులకు అప్పగిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement