Sunday, April 28, 2024

MDK : నీలం మధు ముదిరాజ్‌కే తమ మద్దతు…బీడీఎల్ కార్మికులు..

ప్రజా సేవకుడు, నీలం మధు ముదిరాజ్​కే తమ మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని బీడీఎల్ కార్మికులు అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలోని కీలక నేతలు, పార్టీ ముఖ్య కార్యకర్తలు, కాంగ్రెస్ పెద్దలు, కార్మిక నేతలు నాయకులను మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కలుస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం భానూర్​లోని బిడిఎల్ లోని కార్మిక నేతలు, కార్మికులను కలిసి, పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించాలని మద్దతు కోరారు.

- Advertisement -

ఈ సందర్భంగా బీడీఎల్ ఐఎన్ టి యు సి ప్రెసిడెంట్ హైమాదుల్లా, ఐఎన్టియుసి డిస్టిక్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి మాట్లాడుతు బిజెపి ప్రభుత్వ హాయంలో దేశంలోని కార్మికులంతా తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని నీలం మధుకు హామీ ఇచ్చారు. ఎస్సీ అసోసియేషన్ నాయకులు వెంకటస్వామి, ఎస్టీ అసోసియేషన్ నాయకులు మధు నాయక్, బిసి అసోసియేషన్ నాయకులు హనుమందాస్, రాము, వాసు గౌడ్, శివకుమార్, కృష్ణయ్య, వెంకటేష్, బాల నరసయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement