Saturday, May 4, 2024

టెట్‌ అభ్యర్థుల కొరకు ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులు..

గజ్వేల్‌, (ప్రభ న్యూస్‌): ఈనెల 12వ తేదీ ఆదివారం గజ్వేల్‌, తూప్రాన్‌, నర్సాపూర్‌, రామాయం పేట, సిద్దిపేట తదితర ప్రాంతాల్లో టెట్‌ రాస్తున్న అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. గజ్వేల్‌ బస్టాండ్‌ నుండి మోడల్‌ స్కూల్‌కు 2 బస్సులు, సిద్దిపేట రూట్‌లో 2, జేబీఎస్‌ రూట్‌లో 2, సంగారెడ్డి రూట్‌లో ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు, కలదని, అదనంగా మరో 2 బస్సులు ఉదయం 5 గంటల నుండి అభ్యర్థుల కొరకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

30 మంది కంటే ఎక్కువ మంది ఉన్న మోడల సెంటర్‌ వరకు బస్సును తరలించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం గజ్వేల్‌ బస్టాండ్‌లో హెల్ఫ్‌ డెస్క్‌ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సంప్రదించా ల్సిన ఫోన్‌ నెంబర్లు నర్సింలు 8008578518, శ్రీనివాస్‌ 9885047123 సంప్రదించాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement