చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో ఏసీపీ గంగాధర్, సీఐ లక్ష్మిరెడ్డి, శంషాబాద్ జోన్ ఎస్ వో టి సిఐ వెంకట్ రెడ్డి తో కలిసి మాట్లాడారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. శుక్రవారం అర్ధరాత్రి మొయినాబాద్ మండల పరిధిలోని శ్రీరామ్నగర్ రెవెన్యూలో గల న్యూ గ్రీన్ ఫార్మ్ హౌస్ లో అనుమతి లేకుండా హుక్కా పార్టీ నిర్వహిస్తున్న వారిపై ఎస్ఓటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా రైడ్ చేసి పట్టుకున్నారు. న్యూ గ్రీన్ ఫార్మ్ హౌస్ మేనేజర్ నేహాల్ ఖన్ వద్ద రోజుకు 10 వేల చొప్పున బుక్ చేసుకోగా, అడ్వాన్సుగా 5000 ఇచ్చారని తెలిపారు. అక్కడ సుమారు 15 మంది ఉన్నారని, అందులో విదేశీయులు 10 మంది ఉన్నట్టు తెలిపారు.
విదేశీయులు సుడాన్ కు చెందిన ముగ్గురు, టంజానియాకు చెందిన వారిలో ముగ్గురు, కెన్యాకు చెందిన వారు ఒకరు, కాంగోకు చెందిన వారు ఒకరు.. కిషన్ డేవిడ్ ఏర్పాటుచేసిన పార్టీకి వీరందరూ వచ్చినట్టు తెలిపారు. న్యూ గ్రీన్ ఫార్మ్ హౌస్కు ప్రభుత్వం నుండి కానీ, ఎక్సైజ్ శాఖ నుండి కానీ అనుమతులు లేవని తెలిపారు. శంషాబాద్ జోన్ పరిధిలో 367 ఫార్మ్ హౌసులు ఉంటే ఒక్క మొయినాబాద్ మండలంలో అత్యధికంగా 236 ఫామ్హౌసులున్నట్టు పోలీసులు తెలిపారు. న్యూ గ్రీన్ ఫార్మ్ హౌస్ ఓనర్ హమీద్ ఖాన్ మీద కేస్ బుక్ చేస్తామని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.