Thursday, May 16, 2024

Siddipet: బావిలో రెండు మృతదేహాలు లభ్యం

సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం బూరుగుపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహాలు లభ్యమైన ఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. బుధవారం వ్యవసాయ బావిలో ఇద్దరు యువకుల మృతదేహాలు చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువకుల మృతదేహాలు బావిలో పడి ఉన్నందున వారి వివరాలను సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. ఈ డెడ్ బాడీలు ఎవరివనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement