Saturday, May 18, 2024

Medak: మంత్రాల నెపంతో దంప‌తుల‌ను చిత‌క‌బాదిన‌ బంధువులు

మంత్రాల నెపంతో దంప‌తుల‌పై ద‌గ్గ‌రి బంధువులే దాడి చేసిన ఘ‌ట‌న మెద‌క్ జిల్లాలో జ‌రిగింది. మంత్రాల నెపంతో ఓ ఇద్ద‌రు దంప‌తుల‌ను ద‌గ్గ‌రి బంధువులే విద్యుత్ స్తంభానికి క‌ట్టేసి కొట్టారు. ఈ ఘ‌ట‌న‌ అల్లాదుర్గం గ్రామంలో ఈరోజు వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. బోయిన ర‌మేశ్ (40), ర‌జిత (38) ఊర్లోనే కూలీ ప‌నులు చేస్తూ జీవ‌నోపాధి పొందుతున్నారు. అయితే ఆ దంప‌తులు చేత‌బ‌డి చేస్తున్నార‌ని ద‌గ్గ‌రి బంధువులు అనుమానించారు.

ఈరోజు ఉద‌యం ఇంట్లో ఉన్న‌ ఆ ఇద్ద‌రిని బ‌య‌ట‌కు లాక్కొచ్చారు. ఇష్ట‌మొచ్చిన‌ట్లు కొడుతూ.. గ్రామంలో ఊరేగించారు. అనంత‌రం వారిని విద్యుత్ స్తంభానికి క‌ట్టేసి చిత‌క‌బాదారు. గ్రామ‌స్తులెవ‌రూ ఆ దంప‌తుల‌కు అండ‌గా నిల‌వ‌లేదు. స‌మాచారం అందుకున్న‌ పోలీసులు అల్లాదుర్గం గ్రామానికి చేరుకున్నారు. ర‌మేశ్‌, ర‌జిత‌ను బంధువుల నుంచి విడిపించారు. గాయాల‌పాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మంత్రాల నెపంతో ఆ దంప‌తుల‌పై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement