Sunday, May 19, 2024

విద్యుత్‌ షాక్‌తో మృతిచెందిన యువరైతు..

చిన్నశంకరంపేట : ప్రమాదవశాత్తు విద్యుతుఘాతానికి గురై యువరైతు మృతి చెందిన సంఘటన మండలంలోని కొండాపూర్‌ పరిధిలోని రంగోలిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దండు దినాకర్‌(19) బోరుబావి వద్ద పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లే సరికి విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఫీజ్‌ పోయిందేమోనని పరిశీలించడానికి వెళ్లి చూస్తుండగా ట్రాన్స్‌ఫార్మర్‌ పై నుండి కిందికి వేలాడుతున్న వైర్లు ప్రమాదవశాత్తు తగలడంతో దినాకర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు మృతిచెందాడని తల్లిదండ్రులు బాల్‌రాజ్‌ సుజాత ఆరోపించారు. అధికారులకు పొలం మధ్యలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి వేరే చోటుకు మార్చాలని పలుమార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎస్‌ఐ గౌస్‌ శవాన్ని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement