Tuesday, May 7, 2024

దైవచింతనతో మానసిక ప్రశాంతత : ఎమ్మెల్యే జీఎంఆర్

ప‌టాన్ చెరు : ప్రతిరోజు దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు పట్టణంలోని శాంతినగర్ హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సందీప్ షా, సునీల్ కుమార్, నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement