Monday, April 29, 2024

నీలం మాన‌వ‌తా సాయం.. పిల్ల‌ల పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్

ఆడ శిశువుల‌కు అండగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ మరోసారి ఉదారతను చాటుకున్నారు. మంత్రి హరీష్ రావు జన్మదినాన 22 మందికి, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా 50 మందికి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద చిన్నారులకు ఆపన్న హస్తం అందించారు. ఒక్కొక్కరి పేరుపైన నీలం మధు ముదిరాజ్ రూ.5,000లు ఫిక్స్డ్ డిపాజిట్ వేయించారు. ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటారు, అలాంటి మహాలక్ష్మిలకు తన వంతుగా ప్రోత్సహించేందుకు బీఅర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమాజంలో మహిళల పట్ల గౌరవం పెంపొందాలనే సంకల్పంతో తన గ్రామంలో జన్మించిన ప్రతి ఆడ శిశువుకు తన వంతు చేయూతనందిస్తున్నారు. మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని 2022 జూన్ 2న ప్రారంభించిన ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. హరీష్ రావు జన్మదినం సంద‌ర్భంగా గతంలో 22మంది అప్పుడే పుట్టిన ఆడశిశువులకు 5 వేల రూపాయలను నీలం మధు ఆద్వర్యంలోని ఎన్ఎంఅర్ యువసేన ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. గురువారం బీఅర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 50మంది ఆడ శిశువుల పేరు పైన 5 వేల రూపాయల చొప్పున డిపాజిట్ చేసి తన ఉదారతను చాటుకున్నారు. బీఆర్ఎస్ 22వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చిట్కుల్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో నీలం మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 50 మంది శిశువులకు ఫిక్స్ డ్ డిపాజిట్ పత్రాలని అందచేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆడ పిల్లలు ప్రతి ఇంటికి మహాలక్ష్మి అన్నారు. అడపిల్లలని ప్రోత్సహించే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అడుగుజాడల్లో నడుస్తూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ముఖ్యంగా కేసీఆర్ కిట్, ఆడపిల్లల పెళ్ళిలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో చేయూతనందిస్తున్నారన్నారు. మహిళల భద్రతకు దేశంలో ఎక్కడాలేని విధంగా షీ టీంలను ప్రవేశపెట్టి రక్షణగా నిలుస్తున్నార‌న్నారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆనందం వ్యక్తం చేశారు. నేడు దేశవ్యాప్తంగా ప్రజలంతా కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. దేశం గర్వించదగ్గ నాయకుడైన కేసీఆర్ కు ముచ్చటగా మూడోసారి అధికారం కట్టబెట్టి అండగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తన వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో తాను మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి తనని నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు హెల్త్ ఆఫీసర్ డా.గోపినాయుడు, ఎంపీహెచ్ఓ కృష్ణాప్రసాద్, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, కృష్ణ, భుజంగం, శ్రీను, మురళి, వెంకటేష్, రాజ్ కుమార్, యాదగిరి, ఆంజనేయులు, మాజీ PACS చైర్మెన్ నారాయణ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు ప్రశాంత్, ANM వాణీ, గోపాల్, శ్రీను, అనిల్, నరేష్, వెంకటేశ్, ఆశా వర్కర్లు, మహిళలు, NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement