Sunday, April 28, 2024

MDK: అక్టోబర్ 4న గజ్వేల్ లో ముదిరాజుల సింహగర్జన

గజ్వేల్, సెప్టెంబర్ 29 (ప్రభ న్యూస్) : అక్టోబర్ 4న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ముదిరాజుల సింహగర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ముదిరాజ్ సంఘం నేతలు తెలిపారు. ఈ సింహగర్జన సభకు సంబంధించి ముదిరాజ్ లు గజ్వేల్ లోని టి వైఆర్ గార్డెన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింహగర్జన ర్యాలీకి ముదిరాజ్ మండల అధ్యక్షులు, ముదిరాజ్ ఎంపిటిసిలు, సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, ముదిరాజ్ సంఘ నాయకులు కలిసికట్టుగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ లను బీసీడీ నుండి బీసీ ఏకి మార్చాలని, ముదిరాజులకు చట్టసభల్లో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో గజ్వెల్ లో జరిగే ముదిరాజ్ ల సింహగర్జన ర్యాలీని విజయవంతం చెయ్యాలని ముదిరాజ్ లు తీర్మానించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ యువసేన ఉపాధ్యక్షులు గుంటుకు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పిట్ల ఆంజనేయులు, జగదేవపూర్, ములుగు, వర్గల్, ప్రజ్ఞాపూర్, ముట్రాజ్ పల్లి అధ్యక్షులు రాగులరాజు, జోగిని రవి, శ్రీరామ్ నర్సింలు, నగేష్, కుంటసత్యం, రొట్టెల శ్రీనివాస్, మర్కంటీ పోశయ్య, యూత్ అధ్యక్షులు రిప్పలసామి, హేమసురేష్, జగదేవపూర్ మహిళా అధ్యక్షులు కొన్నే జయమ్మ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటి కౌన్సిలర్ లు గుంటుకు శిరీష రాజు, మర్కంటి వరలక్ష్మి కనకయ్య, మాథ్ పల్లిసర్పంచ్ బచ్చలిమహిపాల్, ములుగు ఎంపిటిసి హరిబాబు, దర్మారం సర్పంచ్ పిట్టల రాజు, దాతర్ పల్లి ఉపసర్పంచ్ తలారి స్వామి, దుద్దెడ గణేష్, బీసీ నాయకులు రాగుల బలరాం, నర్సింలు, సింగాటం రాజు, బలవంత్, పల్లెబాబు, మండల కమిటి, గ్రామ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement