Wednesday, May 1, 2024

సిద్దిపేట జిల్లా రైతుల నిర‌స‌న దీక్ష‌లో పాల్గొన్న మంత్రి హ‌రీశ్ రావు

తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనుగోలుపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన విష‌యం విదిత‌మే. అయితే రైతుల వ‌డ్ల‌ను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద 5వేల మందితో చేప‌ట్టిన‌ నిరసన దీక్షలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement