Monday, May 6, 2024

కల్లాలకు నిధులు..

జగదేవపూర్ : గత సెప్టెంబర్ నుంచి ఉపాధి హామీ పథకంలో నిర్మించిన పశువుల షెడ్ లకు, కల్లాలకు  నిధులు వెంటనే ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు  సంద బోయిన  ఎల్లయ్య శనివారం నాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జగదేవపూర్ మండలం లో తిగుల్ గ్రామంలో పర్యటించడం జరిగిందని అన్నారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో  అనేక మంది ఉపాధి హామీ పనుల కింద పశువుల పాక ,పొలాల వద్ద కల్లాలు  నిర్మించుకోవాలని  అధికారులు చేసిన సూచన మేరకు రైతులు  అప్పులు చేసి మరి  పశువుల పాక మరియు కల్లాలను  నిర్మించడం జరిగిందని అన్నారు.  కానీ ఆరు నెలలు  దాటినా ఇంతవరకు ప్రభుత్వం నుండి డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని  అన్నారు. వడ్డీ బాధలు పెరుగుతున్నాయని వెంటనే ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిచో మండల కార్యాలయం ముందు రైతులతో ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యాదవ రెడ్డి మల్లేశం మల్లయ్య పర్శరాములు తదితరులు పాల్గొన్నారు.        

Advertisement

తాజా వార్తలు

Advertisement