Sunday, April 28, 2024

MDK: చింతా ప్రభాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు…

సంగారెడ్డి మండలం కలాబ్ గుర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ యువకులు చింతా ప్రభాకర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సదాశివపేట పట్టణంలోని చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయ ఆవరణలో పార్టీలో నూతనంగా చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చింత ప్రభాకర్ నాయకత్వంలో పని చేయడానికి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.

పార్టీలో చేరిన వారిలో అసిఫ్ వార్డు మెంబర్, మాక్బోల్, శౌకత్, రహీమ్, షఫీ, శంషుద్దీన్, కాజా, యాధుల, ఎస్కే ఆసిఫ్, ఆసిఫ్, ఇస్మాయిల్, మన్సూర్, ఆది, ఆఫీస్, సద్దాం, మన్సూర్, అంజద్, ఖలీల్, జావీద్, గౌస్, పాషా, సరిపోద్దిన్, అమీర్ ఖాన్, జహంగీర్, కాజా పాషా, మొఖిమ్, తన్వీర్, అసిఫ్, అమీర్, ఇస్మాయిల్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి, గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement