Tuesday, April 30, 2024

HYD: బీజేపీ అభ్యర్థి రంగారెడ్డిని గెలిపించాలి.. డీకే అరుణ

కర్మన్ ఘాట్, నవంబర్ 15 (ప్రభ న్యూస్) : బీజేపీ అభ్యర్థి రంగారెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఓటర్లను అభ్యర్థించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డికి మద్దతుగా హస్తినాపురం డివిజన్ జడ్పీ రోడ్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా డీకే అరుణ హాజరయ్యారు. హస్తినాపూర్ చౌరస్తా నుండి భారీ ర్యాలీగా జెడ్పి రోడ్డుకు చేరుకొని డీకే అరుణ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షలాది కోట్లు అప్పు చేసి అవినీతికి పాల్పడ్డారని డీకే అరుణ ఆరోపించారు.

లక్షలాది కోట్లు అప్పు తెచ్చి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పాలన కొనసాగించారన్నారు. నిరుద్యోగులకు 3 వేల 16 రూపాయలు, దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూంలు, రేషన్ కార్డులు నేటికీ అందించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పథకాలకు కేసిఆర్ కేటీఆర్ ఫోటోలు పెట్టుకున్నారని తెలిపారు. స్మశాన వాటికల మీద కూడా కేసీఆర్ ఫోటోలు పెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిరుద్యోగులు, విద్యార్థులను రెచ్చగొట్టి 1200 మందిని బలిగొన్నరని అన్నారు. వారిని 9 సంవత్సరాలు గడుస్తున్న కుటుంబాలను పట్టించుకోలేదన్నారు. నియోజకవర్గ అభ్యర్థి సామ రంగారెడ్డి గత 16 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ప్రతి సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు అండగా నిలిచిన సామ రంగారెడ్డికి ఓటు వేసి గెలిపించాలన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. టీడీపీ నాయకుడు బూరం ప్రకాష్ నాయకత్వంలో సుమారు 600మంది యువకులు డీకే అరుణ సమక్షంలో సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నరేష్ యాదవ్, కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి, నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement