Tuesday, May 14, 2024

siddipet: అదనపు కట్నం కోసం భార్యను హత్య చేసిన భర్త..!

సిద్దిపేట బ్యూరో/ సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో దారుణం జరిగింది. అదనపు కట్నం కోసం భార్యను హత్య చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం చల్మెడ గ్రామానికి చెందిన భవాని 23 మిరుదొడ్డి గ్రామానికి చెందిన పూస కనకరాజు 26తో గత సంవత్సరం క్రితం వివాహం జరిగింది. గత ఆరు నెలల నుండి తరచుగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

గత వారం క్రితం మృతురాలి తల్లిదండ్రులు నచ్చజెప్పి అత్తగారింటిలో వదిలివెళ్లారు. తిరిగి అదనపు కట్నం తేవాలి అంటూ భవానిని మంగళవారం ఉదయం 6గంటల ప్రాంతంలో దిండుతో హత్య చేసినట్లు దుబ్బాక సిఐ మున్నూరు కృష్ణ తెలిపారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement