Saturday, May 4, 2024

13న షిర్డిసాయి ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు..

జిన్నారం, (ప్రభ న్యూస్‌) : ఈ నెల 13న షిర్టిసాయి ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని ఆలయకమిటీ చైర్మన్‌, మాజీ జడ్పీటీసీ కొలన్‌ బాల్‌రెడ్డి తెలిపారు. ఉదయం 4.15గంటలకు స్వామివారికి కాక డహారతి, 5.30గంటలకు స్వామివారికి అష్టద్రవ్యములతో అష్టాభిషేకం, 6.30 గంటలకు మూలమ(లక్ష్మీగణపతి, దత్తాత్రేయ, రుద్రహోమం), 8గంటలకు గురుపూజ మహోత్సవం, ద్వాదశ హారుతలు,

తీర్థప్రసాద వితరణ, 10గంటలకు సాయిస త్యవ్రతాలు, 11గంటలకు సాయి భజన, 12గంటలకు సాయి మధ్యాహ్నా హరతి, మధ్యాహ్నాం 12.30 అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 6గంటలకు సాయిదూప హారతి, సాయంత్రం 6:30సాయి పల్లకి సేవ అనంతరం సాయిభజన, రాత్రి 8:30 గంటలకు సాయి శేజహారతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement