Wednesday, May 1, 2024

గోశాలకు జడ్పీటిసి చేయూత..

శివ్వంపేట : మండలంలోని దొంతి వేణుగోపాలస్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్న గోశాలలోని ఆవుల ఆకలి తీర్చాలనే ఉద్దేశ్యంతో జడ్పీటిసి పబ్బ మహేష్‌గుప్త తన స్వంత డబ్బులు రూ.20వేలతో పశుగ్రాసం కొనుగోలు చేసి గోశాలకు అందజేశారు. అలాగే సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రానికి చెందిన వైన్స్‌ యజమాని రాజేందర్‌రెడ్డి, రిపోర్టర్‌ బుక్క శ్రీనివాస్‌, బుక్క శ్రీకాంత్‌, బొజ్జ ఫణిభూషణ్‌, నవీన్‌రెడ్డి, బంగారం దుకాణం యజమాని ధర్మారం, మార్వాడి రాజేందర్‌ సింగ్‌ కలిసి ఒక ట్రాక్టర్‌ పశుగ్రాసాన్ని దొంతి గోశాలలోని ఆవుల గురించి అందజేశారు. మూగజీవాల ఆకలిని తీర్చడానికి అడగకుండానే తమవంతు సహాయంగా దొంతి గోశాలకు పశుగ్రాసం అందించిన దాతలందరికీ గోశాల ట్రస్ట్‌ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement