Sunday, April 28, 2024

Medak | ప్రాణం తీసిన ఆర్థిక ఇబ్బందులు.. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉరేసుకుని చనిపోయిన ఘటన మెదక్​ జిల్లాలో జరిగింది. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట గ్రామానికి చెందిన తిరునహరి శ్రీరాములు (50) ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు.

అతనికి ఒక కుమారుడు, కూతురున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేనందున మనస్తాపంతో ఇంట్లో దులానికి ఉరేసుకుని చనిపోయినట్టు తెలిపారు. మృతుని కుమారుడు ఉదయ్ కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement