Tuesday, April 30, 2024

Big Breaking | హైదరాబాద్​లో ఘోరం.. ఇద్దరు ట్రాన్స్​జెండర్ల దారుణ హత్య

హైదరాబాద్​లోని ఓల్డ్ సిటీలో దారుణం జరిగింది. టప్పాచబుత్రా వద్ద బుధవారం తెల్లవారు జాము సమయంలో ఇద్దరు ట్రాన్స్​జెండర్లను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ డబుల్​ మర్డర్​తో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. మృతులను యూసుఫ్ అలియాస్ డాలీ, రియాజ్ అలియాస్ సోఫియాగా గుర్తించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

హైదరాబాద్​లోని పాత బస్తీలో ఇద్దరు ట్రాన్స్​జెండర్ల మర్డర్​తో భయాందోళన నెలకొంది. టప్పాచబుత్రా ప్రాంతంలో ఉన్న ట్రాన్స్​జెండర్లు వారి ఇంటి నుంచి బైకుపై ఏకాంత ప్రదేశానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం. దుండగులు వారిపై పెద్ద పెద్ద రాళ్లు, బాకులతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఇద్దరు ట్రాన్స్​జెండర్లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

- Advertisement -

ఇక.. మే నెలలో పహాడీషరీఫ్ వద్ద మరో ఘటన జరిగింది. ఓ ట్రాన్స్​జెండర్​ ఇంట్లో అజహర్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబ సభ్యులు అతన్ని హత్య చేశారని ఆరోపించారు. ఇద్దరు ట్రాన్స్ జెండర్ల హత్య కేసుతో ఈ ఘటన ముడిపడి ఉందని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement