Friday, May 3, 2024

దళారీల బారిన పడొద్దు..

పాపన్నపేట : రైతులు దళారీల బారిన పడకుండా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని డిఆర్‌డిఎ అదనపు పీడి భీమయ్య తెలిపారు. ఈ మేరకు పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగి గ్రామంలో ఐకేపి ఆధ్వర్యంలో ఆయన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐకేపి డీపీఎంలు మోహన్‌ ప్రకాష్‌, ఏపిఎం సాయిలు, గ్రామసంఘం కొనుగోలు కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement