Wednesday, May 1, 2024

కరోనాపై అవగాహన ర్యాలీ..

తూప్రాన్‌ : పట్టణంలోని మున్సిపల్‌ కమిషనర్‌ మోహన్‌ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని , సామాజిక దూరం పాటించాలని ప్రజలకు సూచించారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని దయచేసి కరోనా రహిత మున్సిపాలిటీగా తూప్రాన్‌ను తీర్చిదిద్దాలని కమిషనర్‌ కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ రమేష్‌, గురుకుల పాఠశాల ప్రన్సిపాల్‌, ఉపాధ్యాయులు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement