Monday, May 20, 2024

కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన కాంగ్రెస్ నేతలు

కేసీఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలకు నిప్పంటించి రోడ్డుపై ఈడ్చికెళ్లిన ఘటన శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పి సీఎం కేసీఆర్ రెండుసార్లు అధికారం చేపట్టినా అభివృద్ధి ఫలితం శూన్యం అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ వక్రీకరించి రాజకీయ పబ్బంగడుపుకుంటుందని ఎద్దేవా చేశారు.

సీఎం కేసీఆర్ లక్ష రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికీ అమలుకు నోచుకోని దౌర్భాగ్య స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉందని తీవ్రంగా విమర్శించారు. పంట నష్ట పరిహారం ఇస్తానని బస్సు ప్రయాణం చేసిన సీఎం కేసీఆర్ ఒక్కొక్కరికి 10000 ఇచ్చి రాష్ట్రమంతా ఎగబెట్టాడని, అనంతరం యూత్ కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మలకు నిప్పంటించి రోడ్డుపై ఈడ్చుకెళ్ళారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement