Tuesday, April 30, 2024

బీసీ కులవృత్తుల లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన మంత్రి మల్లారెడ్డి

ప్రభ న్యూస్ ప్రతినిధి, మేడ్చల్ జులై 15: మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం బీసీ కులవృత్తుల వారికి లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

జిల్లాలో మొదటి విడతగా నియోజకవర్గానికి 50మందికి చొప్పున 5 నియోజక వర్గాలకు 250 మందికి రూ.1,00,000 ల చెక్కులను ఎక్కడికక్కడే పంపిణీ చేశారు. కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో 50 మందికి మంత్రి మల్లారెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నర్సింహా రెడ్డి, అభిషేక్ అగస్థ్య, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి కేషూరాం, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement