Sunday, April 28, 2024

Sangareddy: జిల్లా నూతన ఎస్పీగా చెన్నూరి రూపేష్

సంగారెడ్డి, అక్టోబర్ 13 (ప్రభ న్యూస్): సంగారెడ్డి జిల్లా ఎస్పీగా చెన్నూరి రూపేష్​ నియమితులయ్యారు. వరంగల్​ జిల్లా ఆయన స్వస్థలం. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన 2016 యూపీఎస్సీ పరీక్షల్లో 526 ర్యాంకు సాధించారు. 2017 బ్యాచ్​ కి చెందిన ఐపీఎస్​ ఆయన. తల్లిదండ్రులు రమణయ్య, సరోజనమ్మ. ఇటీవల వరకు సంగారెడ్డిలో ఎస్పీగా పనిచేసిన ఎం.రమణకుమార్​ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

ఆయన స్థానంలో తాజాగా రూపేష్​కు బాధ్యతలు అప్పగించారు. కేవలం చదువు మాత్రమే ఉన్నతంగా ఎదిగేందుకు దోహదం చేస్తుందని నమ్మి, కష్టాలన్నింటినీ భరిస్తూ ఆయన ఐపీఎస్​ స్థాయికి చేరారు. నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం హైదరాబాద్​లో డీసీపీగా పనిచేస్తున్నారు. ఆయనను సంగారెడ్డి ఎస్పీగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement