Tuesday, April 30, 2024

గంజాయి ముఠాను ప‌ట్టుకుని.. పోలీసుల‌కు అప్ప‌గించిన బీజేపీ నాయ‌కుడు

జిన్నారం : బొల్లారంలోని సుల్తాన్ పూర్ పరిధిలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నా అధికారులు ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. లక్షల్లో వ్యాపారం సాగుతున్నప్పిటికీ పోలీసులు తూతూ మంత్రంగా తనిఖీలు చేప‌డుతున్నారు. జిన్నారం మండల కేంద్రంలోని బొల్లారంలో మంగళవారం తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా 20 కేజీల గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న బిజెపి నాయకుడు ఆనంద కృష్ణ రెడ్డి వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఒక పోలీసు అధికారులు చేసే పనిని ఒక నాయకుడు చేయడంతో బొల్లారం గ్రామ ప్రజలు యువత తల్లిదండ్రులు ఆయనను అభినందించారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించి గంజాయ్ గుట్కా విక్రయాలు చేసే డాన్ ను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపించాలని ప్రజలు వేడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement