Tuesday, April 30, 2024

తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ప‌టాన్ చెరు : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి దేశవ్యాప్తంగా తిరుగులేని శక్తిగా మారబోతోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం క్యాసారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ భూపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అజీమ్, సుభాష్ రెడ్డి, ఎండీ చాంద్ తదితరులు ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుపరిస్తున్న సంక్షేమ పథకాలు చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ప్రతిపక్షాల పార్టీల నాయకులు, కార్యకర్తలు భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నారని తెలిపారు. అతి త్వరలో పటాన్ చెరు నియోజకవర్గం లోని ప్రత్యక్ష పార్టీల ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని తెలిపారు. పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుని ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప‌టాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, క్యాసారం గ్రామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభాకర్, శరణప్ప, నర్సింలు, సత్యనారాయణ గౌడ్, సుధాకర్ రెడ్డి, రాజేశ్వర్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, నర్సింలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement