Saturday, April 20, 2024

దేశ రాజ‌ధానిలో ముస్తాబ‌వుతున్న బీఆర్ఎస్ కార్యాలయం..

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇటీవ‌లే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన విష‌యం తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత నుండి బీఆర్ఎస్ కార్య‌క‌లాపాలు వేగ‌వంతం చేస్తున్నారు. అందులో భాగంగానే దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాయలం ముస్తాబవుతోంది. ఈనెల 14వ తేదీన ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

ఇప్పటికే ఎస్పీ రోడ్ గులాబీమయంగా మారడంతో పాటు రోడ్డుకు రెండు వైపులా కేసీఆర్, బీఆర్ఎస్ ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను టీఆర్ఎస్ ఎంపీలు పరిశీలించారు. ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్న కేసీఆర్ రేపు స్వయంగా పార్టీ కార్యాలయ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం లాన్ లో యాగశాలను కూడా ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. రాజశ్యామల, నవచండీ సహా మూడు యాగాలు నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement