Sunday, May 5, 2024

సింగూర్ వరద కాల్వకు గండి – ప్రమాదకరంగా ఇసోజిపేట చెరువు

జోగిపేట, సెప్టెంబర్4( ప్రభన్యూస్): రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పుల్కల్ మండల పరిధిలోని  ఇసోజిపేట నుంచి సుల్తాన్ పూర్ వైపు వెళ్లే వ‌ర‌ద‌ కాల్వ సోమవారం తెగిపోయింది. కెనాల్ ద్వారా ప్రవహిస్తున్న నీరు ఇసోజీపేట చెరువులోకి వెళ్లాడంతో చెరువు పూర్తిగా నుండి ప్రమాదకరంగా మారింది. నీరు అధికంగా రావడంతో ఏ క్షణమైనా చెరువు కట్ట పగిలే అవకాశం ఉందని రైతులు భ‌య‌ప‌డుతున్నారు. సింగూరు కాలువ నుంచి వచ్చే నీటిని నిలిపివేయాలని అధికారులను కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement