Tuesday, April 30, 2024

రైలు ఢీకొని వ్యక్తి మృతి.. జ‌హీరాబాద్‌లో ఘ‌ట‌న‌

జహీరాబాద్ (ప్రభ న్యూస్) : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ కేంద్రంలో ఘోరం జ‌రిగింది. రైల్వే స్టేషన్ పక్కన అండర్ బ్రిడ్జ్ సమీపంలో రైలు ఢీకొని ఒక‌రు చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌నలో చ‌నిపోయిన వారిని ఆర్య నగర్‌కు చెందిన‌ సగ్గం తుకారాం (55) గా గుర్తించారు. బస్తీ వాసులు తెలిపిన సమాచారం ప్రకారం.. తుకారాం అవివాహితుడు. ఆయనకు కాస్త మతిస్థిమితం లేకుండేదని తెలిపారు. తుకారం పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందా? ఆయనే రైలుకు ఎదురుగా వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విష‌యం తెలియాల్సి ఉంది. రైల్వే స్టేషన్ సిబ్బంది వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా చేయాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement