Friday, May 17, 2024

మొబైల్‌ సిగ్నల్స్‌ చెక్‌ చేస్తున్న టెలికం అధికారులు

నార్సింగి : మండలంలోని వల్లూరు, భీంరావుపల్లి గ్రామాల్లో మొబైల్‌ సిగ్నల్స్‌ రావడం లేదని ఈనెల 11న మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డిని కలిసి విన్నవించడంతో స్పందించిన ఎంపి, టెలికం అధికారులు ఆయా గ్రామాలల్లో మొబైల్‌ సిగ్నల్స్‌ను చెక్‌ చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి సబిత మాట్లాడుతూ మొబైల్‌ సిగ్నల్స్‌ రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎంపి ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాగానే వెంటనే అధికారులను పంపించి సిగ్నల్స్‌ వచ్చేలా చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపి ప్రభాకర్‌రెడ్డికి, ఎంపిపి సబిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీంరావుపల్లి సర్పంచ్‌, టెలికాం అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement