Friday, May 3, 2024

నాచగిరి దేవస్థాన పాలకమండలి ప్రమాణస్వీకారం

వర్గల్‌ : నాచగిరి శ్రీ లక్ష్మీనృసింహ్మస్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణస్వీకార మహోత్సవం సోమవారం నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ తెలిపింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిలతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ రోజారాధాకిషన్‌శర్మ, హేమలతశేఖర్‌గౌడ్‌, రాష్ట్ర అటవీ శాఖ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డిలు పాల్గొననున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్‌గా హన్మంతరావు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అలాగే పాలకమండలి సభ్యులుగా ఎల్‌.రాములుగౌడ్‌, బీ.నాగరాజు, భాగ్యలక్ష్మి, ఎం.సత్యనారాయణ, చంద్రారెడ్డి, వెంకటస్వామి, శ్రీనివాస్‌, రాజు, ఎం.నరేష్‌, ఆర్‌.నాగేశ్వర్‌రావు, ఏ.బీమప్పలు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement