Saturday, May 4, 2024

Medak – వ‌డ్ల‌పై కాకుండా వ‌ల‌స‌ల‌పైనే రేవంత్ దృష్టి – హ‌రీష్ రావు

కాంగ్రెస్ వ‌న్నీ అబ‌ద్ద‌పు హామీలే..
ఒక‌సారి మోస పోయాం .. మ‌రోసారి వ‌ద్దు
రుణ మాఫీ చేయ‌ని కాంగ్రెస్ కు బుద్ది చెప్పాల్సిందే
ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ‌ను రేవంత్ ముంచారు
మెద‌క్ లోక్ స‌భ స‌న్నాహ‌క స‌భ‌లో హ‌రీష్ రావు విమ‌ర్శ‌లు

పాప‌న్న‌పేట – వడ్లపై దృష్టి పెట్టమంటే వలసలపై రేవంత్ రెడ్డి నజర్ పెట్టారన్నారు హ‌రీష్ రావు. మెదక్ జిల్లా పాపన్నపేటలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని ఫైర్ అయ్యారు. ఒకసారి మోసపోయామని.. మళ్లీ మోసపోవద్దన్నారు.

రుణ మాఫీ చేయ‌ని కాంగ్రెస్ కు బుద్ది చెప్పాల్సిందే ..

రుణమాఫీ చేయని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదామని పిలుపునిచ్చారు హ‌రీష్ రావు . తమ నేతల ఇళ్లకు వెళ్లి ఎందుకు కలుస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ జనాన్ని నట్టేటా ముంచిందన్నారు. రాష్ట్రంలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. కేసీఆర్ తోనే మెదక్‌కు రైల్వే లైన్, మెడికల్ కాలేజీ వచ్చాయని గుర్తు చేశారు. పాపన్న పేటలోని 7 మండలాలలకు నీళ్లిచ్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement