Saturday, May 18, 2024

Karnataka : క‌మ‌ల‌తీర్ధం పుచ్చుకున్న సుమ‌ల‌త‌..

బెంగుళూరు – సీనియర్‌ నటి, కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గ స్వతంత్య్ర ఎంపీ సుమలత అంబరీష్‌ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బెంగళూరులోని బీజేపీ కార్యాలయంలో ఇవాళ‌ రాష్ట్ర పార్టీ చీఫ్ బీవై విజయేంద్ర సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ, జేడీఎస్ దళానికి తాను మద్దతు ఇవ్వనున్నట్లు సుమలత అంబరీష్‌ వెల్లడించారు. మాండ్యా నియోజకవర్గంను తాను విడిచిపెట్టడం లేదని, రాబోయే రోజుల్లో తాను పనిచేయడం చూస్తారన్నారు.

బీజేపీలో చేరాలన్న తన నిర్ణయాన్ని సమర్థిస్తూ తాను స్వతంత్ర ఎంపీ అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాండ్య లోక్‌సభ నియోజకవర్గానికి రూ.వేల కోట్ల నిధుల్ని రిలీజ్ చేసిందని సుమలత పేర్కొన్నారు. కాగా పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి జెడియు అభ్య‌ర్ధి, మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి పోటీ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement