Saturday, May 18, 2024

అమెరికాలో మరిపెడ వాసి మృతి.. కుమారుడిని చూసేందుకు వెళ్లి..

మరిపెడ (ప్రభ న్యూస్): మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రానికి చెందిన ఫర్టిలైజర్ వ్యాపారి శ్రీమాన్ గుప్తా అమెరికాలో గుండెపోటుతో శనివారం మృతి చెందారు. వారి బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం.. శ్రీమాన్ గుప్తా కుమారుడు అమెరికాలో స్థిరపడ్డాడు. విజిటింగ్ వీసాతో అమెరికాకు 5 నెలల క్రితం కుమారుడి వద్దకు వెళ్లారు. అక్కడ గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కాగా, శ్రీమాన్ గుప్తా మృతదేహన్నీ స్వదేశానికి తీసుకొచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. స్వగ్రామమైన మరిపెడ పట్టణానికి తీసుకుని వచ్చి దహన సంస్కార ఏర్పాట్లు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement