Saturday, May 11, 2024

ప‌లు మార్గాల్లో.. ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

జంట న‌గ‌రాల ప‌రిధిలో ట్రాక్ మెయింటెనెన్స్..ఆప‌రేష‌న‌ల్ ప‌నుల నేప‌థ్యంలో ఈ నెల 13 అంటే ఈరోజు..రేపు పలు మార్గాల్లో ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో రాకేష్‌ స్పష్టం చేశారు. లింగంపల్లి-నాంపల్లి రూట్‌లో 2, నాంపల్లి-లింగంపల్లి మార్గంలో 3, ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో 5 సర్వీసులను రద్దు చేసినట్లు రాకేష్ తెలిపారు. వీటితో పాటు లింగంపల్లి- ఫలక్‌నుమా మార్గంలో 6 సర్వీసులు, రాంచంద్రాపురం-ఫలక్‌నుమాలో 1, ఫలక్‌నుమా- రాంచంద్రాపురం రూట్‌లో 1, ఫలక్‌నుమా- నాంపల్లి మార్గంలో 1 సర్వీసులు రద్దు చేశారు. ఇలా మొత్తంగా 19 సర్వీసులను రద్దు చేసినట్లు సీపీఆర్వో రాకేష్ పేర్కొన్నారు.

ఈ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని నగరవాసులు తమ ప్రయాణాలు సాగించాలని కోరారు… సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో 21 టిక్కెట్‌ కౌంటర్లను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. సాధారణ రోజుల్లో 12 మాత్రమే ఉండగా.. పండగ రద్దీ దృష్యా అదనపు సిబ్బందిని నియమించినట్టు అధికారులు తెలిపారు. రైళ్లు ఏ సమయానికి, ఏ ప్లాట్‌ఫామ్‌కు వస్తాయనేది ఎప్పటికప్పుడు ప్రకటించడమే కాకుండా.. సహాయకులను అదనంగా సమకూర్చినట్టు పేర్కొన్నారు. టిక్కెట్‌ తనిఖీ సిబ్బందిని 20 నుంచి 40కి పెంచామన్నారు. వీళ్లతో పాటు 60 మంది ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది, 30 మంది జీఆర్పీ నిత్యం విధుల్లో ఉండేలా చూస్తున్నట్టు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement