Sunday, May 19, 2024

Manthani – మహిళా దారుణ హత్య

మంథని అక్టోబర్ 11(ప్రభ న్యూస్): పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ బందెల రాజామణి (37) అనే వివాహిత హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే.. మంథని మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బందెల రాజమణి అనే వివాహిత భర్త గత నాలుగు సంవత్సరాల క్రితం చనిపోవడంతో రేషన్ డీలర్ గా కొనసాగుతుంది. కొంతకాలంగా పైడాకుల సంతోష్ తో ఈమెకు పరిచయం ఏర్పడడంతో ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకుంది.

సంతోష్ కొన్ని రోజులుగా ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా సోమవారం రాత్రే రాజమణి గొంతు కోసి హతమార్చిన సంతోష్ గదికి తలుపులు పెట్టి పారిపోయాడు. రెండు రోజులుగా ఆమె ఫోను లిఫ్ట్ కాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె కొడుకు మంగళవారం రాత్రి గది తలుపులు తీయగా ఆమె హత్యకు గురైనట్లు తెలిసింది. ఆమె సోదరుడు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement