Wednesday, May 8, 2024

HYD : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని గెలిపించాలని మన్సురాబాద్ బీఆర్ఎస్ నేతల ప్రచారం

ఎల్బీనగర్, నవంబర్ 21(ప్రభ న్యూస్) ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని గెలిపించాలని మన్సురాబాద్ బీఆర్ఎస్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విట్టల్ రెడ్డి, అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి ల ఆధ్వర్యంలో స్థానిక నేతలతో మంగళవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ కాలనీ, లెక్చరర్స్ కాలనీ, రాజరాజేశ్వరి, పవనగిరి , శివoహిల్స్ , సిరి హిల్స్ కాలనీలలో పాదయాత్ర ద్వారా ఇంటింట ప్రచారం నిర్వహించారు.

అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్న ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. బీఆర్ఎస్ గెలుపు ద్వారానే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ముందుకెళ్తున్న కేసిఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు సీనియర్ నాయకులు పురుషోత్తం రెడ్డి, సంతోష్, నర్రి వెంకన్న, ఏ ఆర్ సి రెడ్డి ,ఆనంద్ కుమార్ యాదవ్, కేకేఎల్ గౌడ్ ,పారంద నర్సింగ్, నరసింహ గౌడ్ సిద్దగోని జగదీష్ ప్రసాద్ రామకోటి ,నాయిని నరేందర్ రెడ్డి, చంద్రమోహన్ ,రుద్ర యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement