Wednesday, May 22, 2024

మనస్తాపంతో ఆర్టీజన్ కార్మికుడి ఆత్మహత్య

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు-2లో ఆర్టిజన్ గా విధులు నిర్వహిస్తున్న భూపాలపల్లి మండలం మోరాంచపల్లి గ్రామంకు చెందిన ఓ.హరీష్ రెడ్డి సోమవారం ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉండగా ఒక పాప అనారోగ్యంతో ఇటీవల మృతి చెందింది. దీంతో మనస్థాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందినట్లు సమాచారం. మృతికి గల కారణాలు  తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement