Sunday, May 5, 2024

మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం

ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పని చేస్తున్నామని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సుల్తానాబాద్ మండలంలోని దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆనంతరం గ్రామంలో 5 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి, ఎంపీపీ బాలాజీ రావుతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement