Monday, May 6, 2024

TS : గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్‌లో గంజాయిని అమ్ముతున్న వ్య‌క్తిని ఎస్‌వోటీ పోలీసులు శ‌నివారం పట్టుకున్నారు. పాత నేరస్తుడు బానోత్ సాయి కుమార్ దగ్గర 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

వైజాగ్ నుంచి గంజాయి తీసుకుని వచ్చి.. లేబర్ అడ్డాల దగ్గర రోజువారీ కూలీలకు గంజాయి అమ్ముతున్నట్లు తెలిపారు పోలీసులు. నిందితుడిని అరెస్ట్ చేసి జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు సైబరాబాద్ ఎస్‌వోటీ మేడ్చల్ టీమ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement