Tuesday, April 30, 2024

ADB: చెన్నూరు బస్టాండులో వ్యక్తి ఆత్మహత్య..

చెన్నూర్, (ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా చెన్నూరు బస్టాండ్ లో సోమవారం మధ్యాహ్నం వ్యక్తి ఆత్మహత్య సంఘటన చోటచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… కొటపెల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన దుర్గం రాజమల్లు (40) క్రిమిసహారక మందు సేవించి మృతిచెందాడు.

స్థానిక కొత్త బస్టాండ్ లో మృతిచెందినట్లు పోలీసులకు తెలియడంతో సంఘటన స్థలానికి వెళ్ళి పోలీసులు మృతుడు రొయ్యలపల్లి వాసి గుర్తించి తమకు సమాచారం అందించారన్నారు. మృతుడు వ్యవసాయం చేసుకుంటాడనీ, కొంతమేరకు అప్పులున్నాయని బంధువులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య దుర్గ, కూతురు కొడుకు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement