Sunday, April 28, 2024

TS : సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య… బండ‌రాయితోమోది…

సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యాడు. జిన్నారం మండ‌లం ఐడియా బొల్లారంలో బుధ‌వారం ఉద‌యం స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బొల్లారంలో నివాసం ఉంటున్న యాదగిరి అనే వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. ఆ వ్యక్తి పూర్తిగా రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement